Hot Posts

6/recent/ticker-posts

భూ సేకరణ పనులు వేగవంతం చెయ్యాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు


 పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ పనులకు సంబంధించిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.విట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ రేట్ నుండి పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ భూ సేకరణ పై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఏలూరు తూర్పుగోదావరి మన్యం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో భాగంగా భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మాణాలు, తదితర పనులకు గాను ఏలూరు జిల్లాలో 4434 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో గుర్తించిన భూములకు సంబంధించిన భూసేకరణ ప్రకటనలు జారీ చేయాలన్నారు.

మిగిలి ఉన్న భూ సేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో భూసేకరణకు అవసరమైన భూములను గుర్తించాలని, భూసేకరణ కోసం భూమిని గుర్తించిన తర్వాత ఆయా గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 

భూములు గుర్తించిన తర్వాత ఆయా రైతులతో ఆర్డీవో, డి ఎస్పి అధికారులు చర్చించి వారి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. భూములకు పరిహారాన్ని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రైతులకు చెల్లించటానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణ స్నేహపూరిత వాతావరణంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. 

సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, స్పెషల్ కలెక్టర్ యస్. సరళ వందనం, అల్లూరి సీతారామరాజు జిల్లా భూసేకరణ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దాల్లు, డిప్యూటీ తహసీల్దాల్లు, తదితరులు పాల్గొన్నారు.