ఈ రాయితీలతో రైతులు తమ పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ పథకం ద్వారా పాడి రైతులు ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు అండగా నిలిచింది. పశువులకు వ్యాధులు రాకుండా టీకాలు.. నట్టల నివారణ మందులు ఇస్తున్నారు. ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారు.. అలాగే మినీ గోకులం షెడ్లను 100% రాయితీతో మంజూరు చేశారు.
అలాగే పశుగ్రాసం పెంచడానికి రైతులకు రాయితీపై విత్తనాలు ఇస్తున్నారు.. రాయితీపై సమీకృత దాణా కూడా అందిస్తున్నారు. ప్రభుత్వం పశుగ్రాసానికి సంబంధించి గడ్డి విత్తనాలను రాయితీపై అందిస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా ఎన్ని విత్తనాలు అవసరమో గుర్తించి అందజేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం హైబ్రీడ్ జొన్న, మొక్కజొన్న రకాల విత్తనాలను అందజేస్తున్నారు.. ఏకంగా 75 శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నారు. పశుగ్రాసానికి అవసరమైన జొన్న రకాలు 5 కిలోల ప్యాకెట్ ధర రూ.460.. రైతు తన వాటాగా రూ.115 చెల్లిస్తే మిగిలింది ప్రభుత్వం నుంచి రాయితీ.
ఇలా విత్తనాలను ఒక్కో రైతుకు 5 నుంచి 20 కేజీల వరకు అందిస్తున్నారు. మొక్కజొన్న విషయానికి వస్తే.. ఈ విత్తనాలను 5 కేజీల ప్యాకెట్ ధ రూ.340.. రాయితీ తర్వాత రూ.85 చెల్లిస్తే సరిపోతుంది.
అంతేకాదు ప్రభుత్వం సమీకృత దాణాపై కూడా 50శాతం రాయితీ ఇస్తోంది. ఈ మేరకు జిల్లాల బారీగా దాణాను కేటాయించారు. దాణా 50 కిలోల బస్తా ధర రూ.1,110 కాగా.. రాయితీ కింద రూ.555 పోను.. మిగిలిన రూ.555 రైతు చెల్లిస్తే సరిపోతుంది. ఈ దాణాను ప్రభుత్వం ఒక్కో రైతుకు క్వింటా నుంచి 1.50 క్వింటాళ్ల వరకు అందజేస్తున్నారు.
రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పాడి రైతుల అవసరాలు తెలుసుకునే పనిలో ఉంది. దీని కోసం సర్వే చేపట్టింది.. రుణాలు, బీమా వంటి అంశాలపై సర్వే చేస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో సంప్రదిస్తే వివరాలు చెబుతారు.. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు కాపీలు తీసుకెళ్లాలి.
అంతేకాదు ఏపీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 వరకు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏహెచ్ఏలు, పారా సిబ్బంది సర్వే చేస్తున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం పాడి రైతులకు రాయితీపై పశుగ్రాసానికి అవసరమైన విత్తనాలతో పాటుగా దాణాను అందజేస్తోంది.
Social Plugin