రెడ్డివారిపల్లె చెరువు వద్ద మామిడికాయల లోడ్ లారీ బోల్తా
మృతి చెందిన తొమ్మిది మంది కూలీలు
కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమన్న వైఎస్ జగన్
గాయపడిన వారికి ప్రభుత్వం మంచి వైద్యం అందేలా చూడాలన్న వైఎస్ జగన్
ANDHRAPRADESH:అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, రెడ్డివారిపల్లె చెరువు వద్ద మామిడికాయల లోడు లారీ బోల్తాపడిన దుర్ఘటనలో తొమ్మిది మంది కూలీలు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆ పేద కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Social Plugin