ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు.. హైదరాబాద్లోనే ఉన్నాం
ఇక తాజాగా మరోమారు ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయని వారు తెలిపారు. తమ బృందాలు హైదరాబాద్లో మకాం వేశాయని, మరి మరికాసేపట్లో ఎంపీ రఘునందన్ రావు చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దమ్ముంటే కాపాడుకోవాలని సూచించారు. తమ ఫోన్లు ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కానీ తమ సమాచారం దొరకదని చెప్పారు.
రఘునందన్ రావును చంపేస్తామని వార్నింగ్
తాము ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రఘునందన్ రావు ని వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. బిజెపి ఎంపీ రఘునందన్ రావుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి సర్జరీ కాగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎంపీ రఘునందన్ రావును హతమారుస్తామని జూన్ 23వ తేదీన తొలిసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Social Plugin